మన ఫోన్లలో వాడే ఖనిజాలు పర్యావరణ మార్పులో ఉపయోగపడతాయి.

వాతావరణ మార్పులకు కారణమవుతున్న చమురు వాడకం నుంచి ప్రపంచం ఎలా బయటపడనుంది?

దీనికి సమాధానం మీ జేబులోనే ఉంది.

మన ఇళ్లను హీట్ చేసే, రవాణాకు ఉపపయోగపడే విండ్, సోలార్ పవర్ బ్యాటరీల ఉత్పత్తికి మన ఫోన్లలో వాడే క్రిటికల్ మినరల్స్‌ అవసరం ఎంతో ఉంది.

మీ ఫోన్‌ లోపల ఏముందో స్క్రోల్ డౌన్ చేసి చూడొచ్చు, ఏ ఖనిజాలను ఇది అందిస్తుందో తెలుసుకోవచ్చు.

స్క్రీన్, మైక్రో చిప్స్, కేబుల్స్, బ్యాటరీ వంటి తన కంపోనెంట్ పార్ట్‌లను చూపించడానికి మొబైల్ ఫోన్‌ను ఎక్స్‌పాండ్ చేశారు.

స్క్రీన్, మైక్రో చిప్స్, కేబుల్స్, బ్యాటరీ వంటి తన కంపోనెంట్ పార్ట్‌లను చూపించడానికి మొబైల్ ఫోన్‌ను ఎక్స్‌పాండ్ చేశారు.

మీరు మొబైల్‌ను విడదీస్తే, కనిపించేది ఇదే.

దీనిలో ఉండే ఖనిజాలు ఇవే. బ్యాటరీలో నికెల్, లిథియం, కోబాల్ట్ ఉంటాయి.

ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు, ఇళ్లకు, ఆఫీసులకు ఈ ఖనిజాలు చాలా అవసరం. 2030 నాటికి నెట్ జీరో కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరుకునేందుకు వీటి అవసరం ఎంతో ఉంది.

కేబుల్, సర్క్యూట్‌ బోర్డు, బ్యాటరీ, కేసింగ్‌తో అనుసంధానమైన ఫోన్‌ను హైలైట్ చేశాం.

ఫోన్‌‌లో మిగిలిన భాగాల్లో నికెల్‌ను గుర్తించవచ్చు. వైద్య పరికరాలతో సహా చాలా ఉత్పత్తుల్లో ఇది ఉంటుంది.

ఫోన్ బ్యాటరీని హైలైట్ చేశాం.

మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసేందుకు ‘మూడ్ స్టెబిలైజర్’ ఔషధంగా లిథియం ఖనిజాన్ని వాడతారు.

ఫోన్ బ్యాటరీని హైలైట్ చేశాం.

రీఛార్జ్ చేసే బ్యాటరీల్లో కోబాల్ట్‌ను ప్రధానంగా వాడతారు. ఆభరణాల్లో కూడా ఇది కనిపిస్తుంది.

బ్యాటరీలపై మనం ఎందుకు ఫోకస్ చేశాం? ఎందుకంటే, వాతావరణ మార్పులను అరికట్టేందుకు దేశాలకు ఈ ఖనిజాల అవసరం ఎంతో ఉంది.

ఇంటి ముందున్న సోలార్ ప్యానల్స్‌తో ఎలక్ట్రిక్ కారులో ఉన్న పెద్ద బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చు.

ఎలక్ట్రిక్ వెహికిిల్స్‌లోని బ్యాటరీల కోసం క్రిటికల్ మినరల్స్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది.

2020లో, ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన 25 కొత్త వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వెహికిల్ ఉంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) తెలిపింది. ఈ ఏడాది ప్రతి ఐదింట్లో ఒకటి ఇది ఉంటుందని అంచనావేసింది.

హరిత వనరుల ద్వారా ఛార్జ్ చేస్తే శిలాజ ఇంధనాల ఇంజిన్లతో పోలిస్తే నాలిగింతలు లేదా అంతకంటే ఎక్కువ క్లీన్ ఎనర్జీని ఎలక్ట్రిక్ వెహికిల్స్ అందిస్తాయి.

సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, విండ్ టర్బైన్స్ వంటి గ్రీన్ టెక్నాలజీలకు క్రిటికల్ మినరల్స్ అవసరం.

వచ్చే 20 ఏళ్లలో భారీ వృద్ధిని నమోదు చేయనున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్, గ్రిడ్ స్టోరేజ్. అందుకే మనకు పెద్ద మొత్తంలో ఈ మినరల్స్ అవసరం.

క్రిటికల్ మినరల్స్‌కు ఉన్న డిమాండ్‌పై మీరు ఓ లుక్కేయండి.

నికర జీరోను మనం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు డిమాండ్ ఎలా మారుతుంది? నికర జీరో అంటే వాతావరణంలోని గ్రీన్ హౌస్ గ్యాస్‌లకు కొత్తగా ఎలాంటి ఉద్గారాలను చేర్చకపోవడం.

2022లో నికెల్‌కు డిమాండ్ 3,200  కేటీ, 2030 నాటికి నికర జీరో ఉద్గారాలు చేరుకోవాలని లక్ష్యంగా ఉన్నందున 5,700  కేటీకి పెరగనున్న నికెల్ డిమాండ్, 2030 నికెల్ సరఫరా అంచనా 4,140 కేటీ

మనకు కావాల్సిన మొత్తం మినరల్స్‌లో ఈ మైన్ వాటా

గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నికెల్ వాడకం: 3,200 కిలోటన్నులు(3.2 మిలియన్ కార్ల బరువుకు సమానం)

2030 నాటికి నికర జీరోను చేరుకునేందుకు, మనకు 5,700 కిలోటన్నుల నికెల్ అవసరమని అంచనా.

కానీ, నికెల్ ప్రస్తుత సరఫరా 4,140 కిలోటన్నులుంటుందని అంచనా. 2030 నాటికి నికర జీరోను చేరుకునేందుకు తగినంత సరఫరా లేని నికెల్.

లిథియం, కోబాల్ట్‌పై ఓ లుక్కేద్దాం.

2022లో లిథియం డిమాండ్ 146 కిలోటన్నులు. 2030 నాటికి నికర జీరో ఉద్గారాలను చేరుకునేందుకు 702 కిలోటన్నులు అవసరం, 2030 నాటికి లిథియం సరఫరా 420 కేటీ ఉంటుందని అంచనా.

2022లో లిథియం డిమాండ్ 146 కిలోటన్నులు, 2030 నాటికి నికర జీరో ఉద్గారాలను చేరుకునేందుకు 702 కిలోటన్నులు అవసరం, 2030 నాటికి లిథియం సరఫరా 420 కేటీ ఉంటుందని అంచనా.

2030 నాటికి గ్లోబల్ వార్మింగ్‌ను 1.5సీకి పరిమితం చేసేందుకు లిథియం సరఫరాలను పెంచాల్సి ఉంది.

2022లో కోబాల్ట్ డిమాండ్ 200 కిలోటన్నులు, 2030 నాటిని నికర జీరో ఉద్గారాలను చేరుకునేందుకు 346 కిలోటన్నులు అవసరం, 2030 నాటికి కోబాల్ట్ సరఫరా 314 కిలోటన్నుల వరకు ఉంటుందని అంచనా .

2022లో కోబాల్ట్ డిమాండ్ 200 కిలోటన్నులు, 2030 నాటిని నికర జీరో ఉద్గారాలను చేరుకునేందుకు 346 కిలోటన్నులు అవసరం, 2030 నాటికి కోబాల్ట్ సరఫరా 314 కిలోటన్నుల వరకు ఉంటుందని అంచనా.

2030 నాటికి గ్లోబల్ వార్మింగ్‌ను 1.5సీకి పరిమితం చేసేందుకు కోబాల్ట్ సరఫరాలను మనం పెంచాల్సి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ మినరల్స్ ఎక్కడ దొరుకుతాయో చూద్దాం.

డీ ఆర్ కాంగో, కోబాల్ట్: 74 శాతం, ఇండోనేషియా, నికెల్ : 49 శాతం, ఆస్ట్రేలియా, లిథియం: 47 శాతం

2022లో ప్రపంచవ్యాప్తంగా వెలికితీసిన నికెల్ సరఫరాల్లో మూడింట రెండోవంతు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, రష్యాలోనే ఉత్పత్తి అయింది.

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన లిథియంలో 91 శాతం ఆస్ట్రేలియా, చిలీ, చైనాలో లభ్యం.

ప్రపంచవ్యాప్తంగా కోబాల్ట్ సరఫరాల్లో 82 శాతం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీ ఆర్ కాంగో),ఆస్ట్రేలియా, ఇండోనేషియాలే ఉత్పత్తి

డీ ఆర్ కాంగో, కోబాల్ట్: 74 శాతం, ఇండోనేషియా, నికెల్ : 49 శాతం, ఆస్ట్రేలియా, లిథియం: 47 శాతం

క్రిటికల్ మినరల్స్‌ మైనింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టిన దేశాలు. ఖనిజాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల జాబితా.

ఈ ఖనిజాలను ఎక్కడ ప్రాసెస్ చేస్తారు?

చైనాలో కోబాల్ట్ 74 శాతం, లిథియం 65 శాతం ఉత్పత్తి, ఇండోనేషియాలో నికెల్ 43 శాతం

మైనింగ్ కంటే ప్రాసెసింగ్‌ భౌగోళికంగా ఎక్కువగా కేంద్రీకృతమైంది.

చైనాలో కోబాల్ట్ 74 శాతం, లిథియం 65 శాతం ఉత్పత్తి, ఇండోనేషియాలో నికెల్ 43 శాతం

లిథియం, కోోబాల్ట్‌ను ఎక్కువగా ప్రాసెస్ చేస్తోన్న దేశం చైనా. నికెల్‌ను ఎక్కువగా ఇండోనేషియా ప్రాసెస్ చేస్తోంది.

చైనాలోో కోబాల్ట్ 74 శాతం, లిథియం 65 శాతం, నికెల్ 17 శాతం

చైనాలో కోోబాల్ట్ 74 శాతం, లిథియం 65 శాతం, నికెల్ 17 శాతం

అరుదైన భూ ఖనిజాలను ప్రాసెస్ చేస్తోన్న దేశం చైనా. వీటిని ఎక్కువగా అధునాతన సాంకేతికతల్లో వాడకం

అత్యవసర వనరుల సరఫరాలను, వాణిజ్య మార్గాలను సరిగ్గా చేపట్టకపోతే ప్రమాదాలు నెలకొంటాయని మనకు చరిత్ర చెబుతోంది.
టిమ్ గ్లౌడ్, ఏఈఏ

అత్యవసర వనరుల సరఫరాలను, వాణిజ్య మార్గాలను సరిగ్గా చేపట్టకపోతే ప్రమాదాలు నెలకొంటాయని మనకు చరిత్ర చెబుతోంది.

టిమ్ గ్లౌడ్, ఏఈఏ

చిలీలో లిథియం మైన్

చిలీలో లిథియం మైన్

ఈ క్రిటికల్ మినరల్స్ సరఫరా చేసేందుకు ఉన్న అడ్డంకులేంటి?

మైన్ ఏర్పడేందుకు 15 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు పడుతుంది. 2030 చేరుకునేందుకు మనకి ఏడేళ్ల కంటే తక్కువ సమయమే ఉంది.

అత్యంత దుర్భలమైన పరిస్థితుల్లో డీ ఆర్ కాంగో కోబాల్ట్‌ మైన్‌లో పనిచేస్తోన్న మహిళ
డీఆర్ కాంగోలో కోబాల్ట్ మైన్

అత్యంత దుర్భలమైన పరిస్థితుల్లో డీ ఆర్ కాంగో కోబాల్ట్‌ మైన్‌లో పనిచేస్తోన్న మహిళ

డీఆర్ కాంగోలో కోబాల్ట్ మైన్

కొత్త రిజర్వులు కనుగొన్న తర్వాత, వాటిని వెలికితీసేందుకు రోడ్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండటం లేదు.

కొొత్త మైన్లు అసురక్షితం కావొచ్చు. వీటిని న్యాయంగా, సమానమైన రీతిలో వెలికితీసేందుకు స్థానిక కమ్యూనిటీలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో పెద్ద ఎత్తున కోబాల్ట్, కాపర్ మైన్లను విస్తరించేందుకు బలవంతంగా స్థానిక కమ్యూనిటీలను తరలింపు చేపట్టారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో పెద్ద ఎత్తున కోబాల్ట్, కాపర్ మైన్లను విస్తరించేందుకు బలవంతంగా స్థానిక కమ్యూనిటీలను తరలింపు చేపట్టారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్

విద్యుత్‌ను ఉత్పత్తి  చేసి, బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. వాటిని మళ్లీ రీసైకిల్ చేస్తారు. అదే సర్క్యూలర్ ఎకానమీ.

సమయం గడుస్తున్నా కొద్ది బ్యాటరీలను కూడా రీసైకిల్ చేయాల్సి ఉంటుంది.

చాలా వరకు ఎలక్ట్రిక్ వెహికిల్ బ్యాటరీలను 20 ఏళ్లలో మార్చాల్సి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రస్తుతం సగానికి కంటే తక్కువ బ్యాటరీ మెటీరియల్స్ మాత్రమే రీసైకిల్ చేయనున్నట్లు బర్మింగ్హామ్‌లోని యూకే యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు.

వచ్చే రెండు దశాబ్దాలలో 80 శాతం రీసైకిల్ చేయాల్సి ఉందన్నారు.

తేలికగా రీసైకిల్ చేసుకునేలా బ్యాటరీలను ఎలా రూపొందించాలో మనం ఆలోచించాల్సి ఉంది.
యూకేలో బర్మింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పౌల్ ఆండర్సన్

తేలికగా రీసైకిల్ చేసుకునేలా బ్యాటరీలను ఎలా రూపొందించాలో మనం ఆలోచించాల్సి ఉంది.

యూకేలో బర్మింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పౌల్ ఆండర్సన్

యూకేలో బర్మింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పౌల్ ఆండర్సన్

యూకేలో బర్మింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పౌల్ ఆండర్సన్